ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీబీఐ రిమాండ్ లో ఉన్న సిసోడియా బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరగనుంది.
కాగా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 3, 2023 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.
అయితే ఇప్పటికే అన్ని రికవరీలు పూర్తి అయినందున తనను కస్టడీలో ఉంచడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ట్రయల్ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ లో సిసోడియా పేర్కొన్నారు.