టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రెండో రోజు నిందితుల విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలో తొమ్మిది మంది నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు.
ప్రశ్నాపత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.అయితే అక్టోబర్ నుంచే నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలోనే టీఎస్పీఎస్సీ కంప్యూటర్ ఉందని పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా అక్టోబర్ నుంచి ప్రతి పేపర్ ను నిందితులు లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారని సమాచారం.అయితే అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 7 పరీక్షలు నిర్వహించింది టీఎస్పీఎస్సీ.
అక్టోబర్ నుంచి పూర్తైన అన్ని పరీక్షల్లో టాప్ మార్క్స్ తెచ్చుకున్న ప్రతీ ఒక్కరిని సిట్ అధికారులు విచారించనున్నారు.