మెగా హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉప్పెన సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న వైష్ణవ తేజ్ ఆ తర్వాత నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి.
ఇది ఇలా ఉంటే ఎవరికైనా తేజ్ హీరోగా మరో సినిమాలో నటిస్తున్నాడు.అందులో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాతోనే శ్రీకాంత్ ( Srikanth )దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై నాగ వంశీ,సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ని విడుదల చేశారు చిత్ర బృందం.
అదేమిటంటే ఈ సినిమాలో మలయాళ హీరో కీలకపాత్రలో నటించనున్నారట.ఆ మలయాళ హీరో మరెవరో కాదు నటుడు బోజు జార్జ్( Boju George ).ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇందులో బోజు జార్జ్ చెంగారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా బోజు జార్జ్ లుకు కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్ అని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.ఆ ఫోటోలో ఒక చెట్టు పదేనైనా ఆయుధాన్ని పట్టుకొని మరొక చేత్తో లైటర్ తో నోట్లో సిగరెట్ ని వెలిగిస్తూ చూడడానికి విలన్ లాగా కనిపిస్తున్నాడు.ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మరి వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో అయినా సక్సెస్ ని అందుకుంటాడో లేదో చూడాలి మరి.ఇందులో బోజు జార్జ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.కాగా వైష్ణవ్ తేజ్ నటించినది మూడు సినిమాలు కాగా అందులో మొదటి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కొండ పొలం రంగా రంగా వైభవంగా సినిమాలో డిజాస్టర్ లుగా నిలిచాయి.







