కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ సర్కార్ ఎమ్మెల్సీ కవితపై కక్ష కట్టిందని ఆరోపించారు.
ఇందులో భాగంగానే రాజకీయ కక్షతో నోటీసులతో వేధిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సమాజం కవితకు అండగా నిలుస్తుందని మంత్రి వేముల తెలిపారు.
మోదీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.