శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహమూర్తుల ఊరేగింపు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం మూర్తుల ఊరేగింపు మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా ఊరేగింపు నిర్వహించారు.శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత విగ్రహం రెండు ద్వారపాలకుల విగ్రహాలు, గణపతి విగ్రహం, అమ్మవారి వాహనం సింహం, తాబేలు విగ్రహాలను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సాహ విగ్రహాన్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించి వాహానం లో శ్రీ మార్కండేయ మందిరం నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

 Procession Of Idols Of Sri Vasavi Kanyaka Parameshwari, Kanyaka Parameshwari, Ra-TeluguStop.com

వాహనం ముందు ఆర్య వైశ్య సంఘం మహిళలందరు ఓకే రకమైన వస్త్రాలు ధరించి భక్తి పాటలతో కోలాటాలతో చేసిన నృత్యాలు అలరించారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా చిన్న మల్లేశం ఆద్వర్యంలో మండలంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube