ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ పరిపాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.జూలైలో విశాఖకు వెళ్తున్నామని తెలిపారు.
అయితే గతంలోనూ సీఎం జగన్ పరిపాలనా రాజధానిపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని ఢిల్లీలో ప్రకటించారు.
తాజాగా మరోసారి విశాఖ నుంచి పాలన అందించడంపై మంత్రుల వద్ద ప్రస్తావించారని సమాచారం.ఈ క్రమంలోనే జూలైలో విశాఖకు వెళ్తామని చెప్పినట్లు తెలుస్తోంది.