ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి.స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటైన బీఏసీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తొమ్మిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.ఈనెల 16న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేశ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవ్వగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.







