వేములవాడ రూరల్ మండలంలో మంజూరైన 33 చెక్కులను ఎమ్మార్వో కార్యాలయంలో పంపిణీ చేసిన రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం కళ్యాణ లక్ష్మి పథకం అని నిరుపేదలకు గొప్ప వరమని కొనియాడిన ప్రజాప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ ఏషా వాణీ తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, బిఆర్ఎస్ రూరల్ పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, ఎమ్మార్వో నక్క శ్రీనివాస్, ఆర్ ఐ బాలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు లబ్ధిదారులు పాల్గొన్నారు.







