బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడున్నర గంటలకు పైగా కవిత విచారణ కొనసాగుతోంది.
మద్యం కుంభకోణంలో అరుణ్ పిళ్లైతో కలిపి కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.కవిత బినామీ పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచారిస్తుంది.
లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.కవితకు మద్ధతుగా బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి తరలివచ్చారు.
మరోవైపు కవిత విచారణపై బీఆర్ఎస్ అప్రమత్తమైంది.ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ విచారణకు సంబంధించిన వ్యవహారంపై హైదరాబాద్ నుంచి ఆరా తీస్తున్నారు.







