ఎలక్ట్రిక్ వెహికల్ ప్రేమికులకు ఓ శుభవార్త.ప్రముఖ ఈవీ స్టార్టప్ అయినటువంటి జెన్ మొబిలిటీ తొలి కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, జెన్ మైక్రో పాడ్ను మొదటి త్రైమాసికం మరో నెల రోజులలో లాంచ్ చేయనుంది.
ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అయినటువంటి ‘నమిత్ జైన్’ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జర్మనీలో రూపొందించిన మైక్రో పాడ్ను భారత్లో స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి దీనిని తయారు చేసినట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
కార్బన్ ఫైబర్, గ్లాస్ ఫైబర్ కలయికతో తయారు చేసిన కాంపోజిట్ వీల్ ప్రత్యేకమైన తేలికైన నిర్మాణంతో ఎలక్ట్రిక్ మోడల్ అంశమని కంపెనీ పేర్కొంది.
మైక్రో పాడ్ లాస్ట్-మైల్ డెలివరీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా దీనిని డెవలప్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రత్యేక స్టోరేజీ బాక్సులో వివిధ షేప్లు, సైజులతో కంపార్ట్మెంట్లుగా ఇది రూపొందించింది.ఇందులో ఇంకో వెసులుబాటు కూడా వుంది… ఈ ఈవీలో ఏదైనా వస్తువులను వేలాదీసేందుకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
ఈవీ జెన్ పేటెంట్ పొందిన ఈవీ డ్రైవ్ట్రెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.ఇందులో మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్తో, మైక్రో పాడ్ రియల్ పరిధి 120కిమీ కన్నా ఎక్కువగా ఉంటుంది.
మొదటి త్రైమాసికంలో భారత్ ఫస్ట్ కార్గో లైట్ ఎలక్ట్రిక్ వెహికల్, జెన్ మైక్రో పాడ్, ARAI సర్టిఫికేట్ ఆఫ్ కన్ఫార్మిటీని అందుకున్నామని జైన్ ఈ సందర్భంగా చెప్పారు.

ఇకపోతే ఈ కంపెనీ కస్టమర్లతో ట్రయల్స్ కోసం ప్రారంభ యూనిట్లు ప్రారంభించనుంది.10వేల యూనిట్లకు పైగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పెద్ద తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది.జెన్ మైక్రో పాడ్ ధరకు సంబంధించి పరిధి, లోడ్ సామర్థ్యం, స్టోరేజీ కంపార్ట్మెంట్ వంటి మల్టీ అంశాలపై ఆధారపడి ఉంటుందని జైన్ అన్నారు.
వస్తువుల రవాణా, ప్రయాణీకుల రాకపోకలను అందించడానికి కంపెనీ మల్టీ-బెనిఫిట్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్, జెన్ మ్యాక్సీ పాడ్ను కూడా ఇక్కడ డెవలప్ చేయబడుతోంది.రాబోయే కొద్ది నెలల్లో క్లయింట్లతో ప్రొటోటైప్ ట్రయల్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జైన్ పేర్కొన్నారు.







