దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ఈడీ, సీబీఐ, ఐటీ కేంద్రం చెప్పినట్లే వింటాయని తెలిపారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే కవితను టార్గెట్ చేశారని ఆరోపించారు.ఏం చేసినా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఎవరికీ తలవంచే రకం కాదని స్పష్టం చేశారు.







