ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల లేమిపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.కనీస వసతులు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ సరూర్ నగర్ కాలేజీలో సుమారు ఏడు వందల మందికి ఒకే టాయిలెట్ అందుబాటులో ఉండటంపై అసహనం వ్యక్తం అయింది.ఈ మేరకు సీఎస్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇంటర్ విద్య కమిషనర్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
అదేవిధంగా దీనిపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.