సంగారెడ్డి జిల్లాలో అంగన్‎వాడీ సిబ్బంది నిర్లక్ష్యం.. చిన్నారికి నరకయాతన

అంగన్ వాడీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ చిన్నారి నరకయాతన అనుభవించింది.ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో చోటు చేసుకుంది.

 Neglect Of Anganwadi Staff In Sangareddy District-TeluguStop.com

కాజీపల్లిలోని అంగన్ వాడీ కేంద్రానికి ఓ చిన్నారి రోజులానే వెళ్లింది.అయితే చిన్నారి అవంతిక స్కూల్ లో ఉండగానే సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు.

ఈ క్రమంలో అవంతిక కోసం గ్రామం అంతా గాలించారు తల్లిదండ్రులు.చివరికి అనుమానం వచ్చి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చూడగా స్టోర్ రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించింది.

వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ ఆయాలను పిలిపించి తాళాలు తీయించారు.బయటకు తీసుకువచ్చిన తరువాత చిన్నారి సృహాలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అవంతిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube