టాలీవుడ్ దర్శకుడు దేవాకట్టా రూపొందించిన సినిమాలలో 2009లో విడుదల అయినా ప్రస్థానం సినిమా కూడా ఒకటి.అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఆ సినిమాను దేవాకట్టా తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఆ సమయంలో ప్రేక్షకులకు ప్రస్థానం సినిమా చూసిన వారికి ఇండస్ట్రీకి మరో గొప్ప డైరెక్టర్ దొరికారు అన్న భావన కలిగింది.
సినీ ప్రస్థానం సినిమా తర్వాత దేవాకట్టా నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
![Telugu Deva Katta, Dynamite, Manchu Vishnu, Prasthanam, Sensational, Tollywood-M Telugu Deva Katta, Dynamite, Manchu Vishnu, Prasthanam, Sensational, Tollywood-M](https://telugustop.com/wp-content/uploads/2023/03/director-deva-katta-sensational-comments-on-dynamite-movie-detailss.jpg)
కానీ ప్రస్థానం సినిమా తర్వాత ఆ స్థాయి సినిమాని, నార్మల్ హిట్ అనిపించుకునే సినిమాలను కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు డైరెక్టర్ దేవాకట్టా.ప్రస్థానం తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకొని ఆటోనగర్ సూర్య సినిమాను తీశాడు.ఆ సినిమా నిరాశపరిచినప్పటికీ అందులో దేవాకట్టా మార్క్ ని నిరూపించుకున్నాడు.
ఆటోనగర్ సూర్య సినిమా తర్వాత మంచు విష్ణు హీరోగా నటించినా డైనమైట్ సినిమాను రూపొందించారు.అయితే దేవాకట్టా ఆ డైనమైట్ సినిమాను ఎందుకు చేశాడా? అని ఫీల్ కలిగించింది.అదే విషయాన్ని దేవాకట్టానే స్వయంగా తెలిపారు.
![Telugu Deva Katta, Dynamite, Manchu Vishnu, Prasthanam, Sensational, Tollywood-M Telugu Deva Katta, Dynamite, Manchu Vishnu, Prasthanam, Sensational, Tollywood-M](https://telugustop.com/wp-content/uploads/2023/03/director-deva-katta-sensational-comments-on-dynamite-movie-detailsd.jpg)
కాగా డైనమైట్ మూవీ తమిళ సూపర్ హిట్ అరిమా నంబి కి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం దేవా కట్టా కేవలం 9 రోజులు మాత్రమే వర్క్ చేసి ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సుల వల్ల తప్పుకున్నాడు.కానీ ఆ సినిమాకి దర్శకుడిగా పూర్తి క్రెడిట్ ఇచ్చాడు మంచు విష్ణు.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ దేవాకట్టా డైనమైట్ సినిమా గురించి మాట్లాడుతూ.డైనమైట్ నా సినిమా కాదు.
ఆ సినిమా ఎందుకు చేశానా అని ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాను.ఎందుకంటే.
అది తమిళ్ మూవీకి రీమేక్.నాకు రీమేక్స్ ఓన్ చేసుకోవడం తెలియదు.
ఒకవేళ అది నా సినిమా రీమేక్ అయినాసరే అంతే.ఎందుకంటే.
తప్పు జరుగుతుందని తెలిసి కూడా ఆ జర్నీ కంటిన్యూ చేయడం తప్పే అవుతుంది.నేను చేసింది అదే అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ దేవాకట్టా.
ఇంటర్వ్యూలో భాగంగా దేవాకట్టా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.