చాలా మంది డైరెక్టర్లు ఇండస్ట్రీ లో చాలా సినిమాలు తీస్తూ ఉంటారు కొందరు మాత్రం కొన్ని సినిమాలు చేసిన అవి చాలా కాలం పాటు గుర్తుండిపోయేలా సినిమాలు తీస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్లలో కృష్ణవంశీ ఒకడు ఆయన చేసిన సినిమాలు చాలా కొత్త గా ఫ్యామిలీ అంత సంబరాలతో నిండిపోయి స్క్రీన్ మీద ఒక పండగలా ఉంటుంది.

ఒక ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని స్క్రీన్ మీద చూపించి అది వాళ్ల ఫ్యామిలీ నా లేక మన ఫ్యామిలీ నా అనే విధంగా మనల్ని మెస్మరైజ్ చేస్తాడు…అయితే కృష్ణ వంశీ చాలా హిట్ సినిమాలు తీశాడు అందులో నాగార్జున హీరోగా టబు హీరోయిన్ గా వచ్చిన నిన్నే పెళ్ళడుతా సినిమా తీసి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమాల్లో ఒక ట్రెండ్ స్తృష్టించాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ గురించి చాలా మంది చాలా రకాలు గా చెప్పుకుంటూ ఉంటారు.ఈ సినిమా షూట్ చేసేటపుడు అసలు కృష్ణవంశీ స్క్రిప్ట్ అనేది రాసుకోకుండా డైరెక్ట్ గా లొకేషన్ లోనే ఎవరు ఏం చెప్పాలి అనేది చెప్పి అలా తీసేవాడు అనే చర్చ అప్పట్లో చాలా పెద్ద ఎత్తున నడిచింది.అలా ఈ సినిమా మొత్తం అలాగే తీసాడట అనే టాక్ బయట భారీగా వినిపించేది దీనిమీద కృష్ణవంశీ స్పందిస్తూ స్క్రిప్ట్ పేపర్స్ లేకుండా అసలు సినిమా ఎలా తీస్తారు నా దగ్గర స్క్రిప్ట్ ఉంది నేను రాసుకున్న పేపర్స్ కూడా ఉన్నాయని చెప్పాడు అలా ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చాడు కృష్ణవంశీ…








