మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‘.ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించారు.
ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు.వీరికి ఇప్పుడు చాలా ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచినా సాంగ్ నాటు నాటు.
వరల్డ్ వైడ్ గా పలు ఇంటర్నేషనల్ సినిమాల పాటలతో పాటు మన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కూడా ఎంపిక అయ్యింది.అయితే గత కొద్దీ రోజుల నుండి ఎన్టీఆర్, చరణ్ లు ఆస్కార్ అవార్డ్స్ రోజు ఈ పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు టాక్ వచ్చింది.
ఇదే నిజమని అంతా అనుకున్నారు.
అయితే ఇది నిజమే కానీ.లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది రామ్ చరణ్, ఎన్టీఆర్ కాదు.ఇందులో పెద్ద ట్విస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అసలేం జరిగింది అంటే.అకాడమీ వారు స్వయంగా ఒక అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
ఈ అనౌన్స్ మెంట్ ఇప్పుడు క్రేజీగా మారిపోయింది.ఈ ఆస్కార్ స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంది అని ప్రకటించారు.
అయితే లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది ఆర్ఆర్ఆర్ హీరోలు కాదట.సింగర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ ఇంకా కాలభైరవ లు లైవ్ లో నాటు నాటు సాంగ్ ను ఆలపించనున్నట్టు అనౌన్స్ చేసారు.దీంతో ఈ ఊహించని ట్విస్ట్ ఇప్పుడు క్రేజీగా మారిపోయింది.
మార్చి 12న జరిగే ఆస్కార్ ఈవెంట్ లో వీరు లైవ్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారు.మరి చరణ్, ఎన్టీఆర్ లు కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.