హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడి ఘటన అందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసేలా చేసింది.ఈ ఘటనలో భాగంగా నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసే విచక్షణ రహితంగా ఆ బాలుడిని చంపేయడం అందరిని ఎంతగానో కలిసివేసింది.
ఇకపోతే ఈ ఘటనపై ఎంతోమంది స్పందిస్తూ పలు కామెంట్లు చేశారు.అయితే కొందరు కుక్కలకు మద్దతు తెలుపగా మరికొందరు చిన్నారి ప్రదీప్ కు మద్దతు తెలిపారు.
ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ కుక్కలకు మద్దతుగా నిలబడటంతో ఎంతోమంది నేటిజన్స్ ఈమెనూ టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా జంతు ప్రేమికురాలు అయినటువంటి అమలా సైతం ఈ ఘటనపై స్పందించినట్టు తెలుస్తోంది.ఒక మనిషి తప్పు చేశారని మానవజాతిని శిక్షిస్తామా అలాగే ఒక కుక్క తప్పు చేసిందని కుక్క జాతిని శిక్షించడం తప్పు కదా అంటూ ఈ ఘటనపై స్పందించినట్లు నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఈ పోస్టును షేర్ చేశారు.దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
అమలా కూడా స్వతహాగా జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈమె జంతువుల కోసం బ్లూ క్రాస్ సంస్థను కూడా నడుపుతున్నారు అయితే ఈ ఘటనపై అమల ఈ విధంగా స్పందించారనే పోస్ట్ వైరల్ కావడంతో అసలు నిజంగానే అమల ఈ ఘటన పై ఇలా స్పందించారా అనే సందేహాలు కలుగుతున్నాయి.ఇక సుప్రీత సురేఖ వాణి కూడా పెట్ లవర్స్ అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఘటన గురించి సుప్రీత అమలా చేసిన వ్యాఖ్యలు అంటూ ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.







