ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ఎవరూ పాదయాత్ర చేయొద్దా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ అందరి హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో పోలీసులు సైతం జగన్ పీనల్ కోడ్ ఫాలో అవుతున్నారని యనమల ఆరోపించారు.
ప్రతిపక్షాలు, మీడియాను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సీబీఐ చేస్తున్న దర్యాప్తునకు సహకరించడం లేదని పేర్కొన్నారు.
అనంతరం టీడీపీ, గూగుల్ టెక్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.







