రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పీఎస్ ఎదుట గిరిజన సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి.
ప్రేమ వ్యవహారంలో నవీన్ ను చంపిన హరిహర కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనకు దిగారు.
అయితే మృతుడు నవీన్, హరిహర కృష్ణలు మహాత్మాగాంధీ వర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే.ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో వివాదం మొదలైంది.
ఈ క్రమంలోనే తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని కోపానికి గురైన హరిహర కృష్ణ పార్టీ చేసుకుందామని పిలిచి నవీన్ ను దారుణంగా హత్య చేశాడు.అనంతరం నవీన్ హత్య విషయాన్ని ప్రియురాలికి మెస్సేజ్ చేసినట్లు తెలుస్తోంది.
అది జోక్ అని భావించిన ప్రియురాలు ఓకే, వెరీగుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చిందని సమాచారం.దీంతో ఆమె పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.







