మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.విచారణలో భాగంగా రెండు గంటలుగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అధికారుల బృందం విచారిస్తోంది.
న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు.అయితే విచారణ సమయంలో న్యాయవాదులకు అనుమతి లేదని సీబీఐ తెలిపింది.
బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.అదేవిధంగా దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ అవినాశ్ ను ప్రశ్నిస్తున్నారని సమాచారం.ఇప్పటికే రూ.40 కోట్ల ఫండింగ్ పై ప్రశ్నించగా అవినాశ్ రెడ్డి తనకేమి తెలియదని చెప్పారని తెలుస్తోంది.దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డితో ఉన్న కాల్ లిస్ట్, నిందితుల టవర్ లొకేషన్లపై ప్రశ్నిస్తుంది.