2019 ఎన్నికల సమయంలో వైయస్ వివేకనంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ హత్య కేసును సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేస్తూ ఉంది.
ఈ కేసుకు సంబంధించి చాలా మందిని ఇప్పటికే సీబీఐ విచారించడం జరిగింది.ఈ కేసుకు సంబంధించి గత నెల జనవరి 28వ తారీకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.
సీబీఐ విచారణకు హాజరయ్యారు.దాదాపు నాలుగు గంటలకు పైగా విచారించడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వైయస్ అవినాష్ రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఈనెల 24వ తారీకు హైదరాబాదు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వాట్సప్ ద్వారా సీబీఐ నోటీసులు పంపింది.మొదటినుండి ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది.ప్రతిపక్షాలు సైతం ఈ విషయంపై మీడియా సమక్షంలో అనేకమంది కామెంట్లు చేయడం జరిగింది.
ఈ క్రమంలో వైయస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికీ సీబీఐ రెండోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.







