రజాకార్ల పాలనను తరిమికొడతానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించనని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ వెల్లడించారు.సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అంతేకాకుండా నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు.తెలంగాణలో రానున్న ఎన్నికలలో బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.