వైసీపీ సర్కార్ పై యనమల మండిపాటు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వ్యవస్థలపై వైసీపీ సర్కార్ కు గౌరవం లేదని విమర్శించారు.

 Yanamala's Anger Over The Ycp Government-TeluguStop.com

ఏపీ రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని యనమల మండిపడ్డారు.రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని పిలిచినా స్పందన లేదని విమర్శించారు.

కార్పొరేషన్ అప్పులతో ప్రభుత్వానికి సంబంధం లేదనడం సరికాదన్నారు.ఎఫ్ఆర్ బీఎం చట్టానికి సవరణ చేసి 90 శాతం లిమిట్ ఉన్న గ్యారెంటీలను 180 శాతానికి ఎందుకు పెంచారని ప్రశ్నించారు.

ఈ నాలుగేళ్ల పాలనలో వేస్ అండ్ మీన్స్ ద్వారా ఎన్ని కోట్లు తెచ్చారని నిలదీశారు.అదేవిధంగా ఏపీ రెవెన్యూ లోటు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube