ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతుహలమ్మ కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతి నగరంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1980-85 మధ్య చిత్తూరు జెడ్పీ ఛైర్ పర్సన్ గా కుతుహలమ్మ విధులు నిర్వహించారు.1985లో వేంపజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.1991-93 సంవత్సర మధ్య కాలంలో ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.
అంతేకాదు 1999-2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు.2007-2009 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.







