పామును చూస్తే వెంటనే చాలా మంది పారిపోతుంటారు.అది దగ్గర నుంచి వెళ్లినా చాలా మందికి చలి జ్వరం వచ్చేస్తుంది.
దూరం నుంచి పామును చూసినా పలువురు భయంతో పరుగులు పెడుతుంటారు.కొన్ని పాములు కాటు వేస్తే మనుషులు చాలా తొందరగా చనిపోతుంటారు.
సాధారణంగా విషపూరితమైన పాము కాటు వేస్తే గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లాలి.అలా కాకుంటే మాత్రం విషం శరీరం అంతా పాకి తొందరగా చనిపోతారు.
ఇక పాముల్లోనూ కొన్ని అరుదైనవి ఉంటాయి.ముఖ్యంగా రెండు తలల పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మితే లక్షల రూపాయలు వస్తుంటాయి.దీంతో ఇలాంటి రెండు తలల పాములు ఎవరికైనా కనిపిస్తే, వాటిని దక్కించుకునేందుకు స్మగ్లర్లు చాలా ఖర్చు పెడుతుంటారు.
చాలా జాగ్రత్తగా దేశం దాటించేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సొమ్ము చేసుకుంటారు.ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము ఏపీలో ప్రత్యక్షం అయింది.

ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఇటీవల రెండు తలల పాము దొరికింది.కత్తుల లోవరాజు అనే వ్యక్తి తన పొలంలో పని చేస్తుండగా దీనిని గమనించాడు.పరిశీలించి చూడగా ఇది 2 తలల పాము అని అర్ధం అయింది.ఇది మీటరు పొడవు ఉంది.అంతేకాకుండా 3 కిలోల బరువు ఉంది.ఇది అరుదైనది కావడంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
ఈ పాముకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.ఇది రెండు తలలను ఉపయోగించి ఆహారం తీసుకుంటుంది.
మొదటి తలతో ఆరు నెలలు, మరో తలతో మిగిలిన ఆరు నెలలు ఆహారం స్వీకరిస్తుంది.విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు చేర వేశారు.
దీంతో ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని ఆ పామును స్వాధీనం చేసుకున్నారు.దీనిని రెడ్ సాండ్ బోయా అని పిలుస్తారని వెల్లడించారు.
రెండు తలలు అనేది ఉండవని, ఆ పాము ఎలుకలు కొరికేస్తే అలా జరుగుతుందని తెలిపారు.దీనిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.







