కాకినాడ ఆయిల్ కంపెనీ ప్రమాదంలో నిందితులకు 14 రోజుల రిమాండ్..!!

గత బుధవారం కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే.

 14 Days Remand For Accused In Kakinada Oil Company Accident Details, Kakinada, K-TeluguStop.com

ఆయిల్ కంపెనీకి చెందిన పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేయడానికి దిగి ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు.దీంతో సదరు ఆయిల్ కంపెనీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలకు దిగింది.

  ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు.క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.

అంతేకాదు ప్రమాదం జరిగిన ఆయిల్ పరిశ్రమ యూనిట్ లో తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది.

Telugu Ap, Gracia, Ragampeta, Kakinada, Kakinadaoil, Oil Tanker-Latest News - Te

ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు కాకినాడ జిజిహెచ్ ఆవరణలో తక్షిణ సాయం కింద 50 వేల రూపాయలు నగదు చొప్పున అధికారులు అందించడం జరిగింది.ఈ  ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుండి ₹25లక్షలు, ప్రభుత్వం నుండి ₹25 లక్షలు మొత్తం 50 లక్షలు… పరిహారంగా ప్రకటించడం జరిగింది.ఇదంతా పక్కన పెడితే ఆయిల్ ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

వారిని మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు.ఈ క్రమంలో నిందితులకు 14 రోజుల రిమాండ్.

విధించడంతో పెద్దాపురం సబ్ జైలుకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube