తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం నెలకొంది.ఇవాళ సమావేశాలకు చివరి రోజు కాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు మార్మోగింది.
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ పదే పదే ఈటల పేరును ప్రస్తావించారు.సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈటల సహకారాన్ని తెలిపారు.
అనంతరం హాస్టల్ డైట్ ఛార్జీలపై ఈటలను పిలిచి మాట్లాడాలంటూ మంత్రి హరీశ్ రావుకు సూచించారు.బస్సుల విషయంలోనూ కూడా ఈటల సూచనలు పాటించాలంటూ ఆర్టీసీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ల విషయంలోనూ ఈటలను కేసీఆర్ సమర్థించారు.







