మహాసేన రాజేశ్ పార్టీలో చేరిక విషయంపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.
మహాసేన రాజేశ్ గురించి జన సైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని ట్విట్టర్ వేదికగా సూచించారు.
అతను ఏ పార్టీలో చేరాలనుకునేది అతని ఇష్టమని చెప్పారు.ఈ నేపథ్యంలో చేరిక అంశం తన ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు.
రాజేశ్ నిర్ణయం ఏదైనా గౌరవించాలని సూచించారు.దళిత వర్గాల్లో గుర్తింపు ఉన్న మహాసేన రాజేశ్ ఈనెల 16న టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే.
అయితే, ముందుగా రాజేశ్ జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగిందని తెలిపారు.అనంతరం టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు.







