మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది.ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
కాగా, ఎమ్మెల్యేపై ఇటీవల రేవంత్ రెడ్డి భూ కబ్జా ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శంకర్ నాయక్ అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.







