శ్రీవారి సేవలో ఏపి‌ డెప్యూటీ స్పీకర్ కొలగట్ల‌వీరభధ్ర స్వామి..

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు వచ్చిన పరిస్ధితే నారా లోకేష్ కు రాబోతుందని, చంద్రబాబుని, నారా లోకేష్ ను ప్రజలు నమ్మె పరిస్ధితిలో లేరని ఏపి‌ డెప్యూటీ స్పీకర్ ‌కొలగట్ల వీరభధ్ర స్వామి విమర్శించారు.శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభధ్రస్వామి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

 Ap Deputy Speaker Kolagatlaveerabhadra Swamy In Srivari Seva, Srivari Seva, Ap-TeluguStop.com

దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.అనేక సార్లు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నా ఈ సారి ప్రత్యేకమైన ఆనందం కలిగిందన్నారు.

విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తున్నాంమని ఢిల్లీలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారన్నారు.రానున్న కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చేందుతుందని భావిస్తున్నాంమని, వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసలు ఆగి పోయిందని, అసలు వలసలు వెళ్ళాలనే ఆలోచనలు లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఆయన చెప్పారు.

ఆసియాలో అత్యంత త్వరగా అభివృద్ధి చేందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఉందని, గతంలోనే చంద్రబాబు హయాంలో విశాఖపట్నంను క్యాపిటల్ గా ప్రకటించి ఉంటే హైదరాబాదు వెన్నంటే అభివృద్ధిలో‌ నడిచేదన్నారు.విశాఖపట్నంను క్యాపిటల్ గా ప్రకటించాలని చంద్రబాబుకు ఆలోచన రాకపోవడం దురదృష్టంమని ఆయన అన్నారు.

ఇప్పటికైనా చొరవ తీసుకుని విశాఖపట్నంను క్యాపిటల్ గా ప్రకటించడంతో యావత్తూ ఆంధ్రలో ఒక్క పేరున్న నగరంగా రూపొందుకుంటుందన్నారు.అనేక పరిశ్రమలు,ఐటీ కంపెనీలు వచ్చేందుకు అవకాశం ఉందని, శ్రీనివాసుడి ఆశీస్సులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చేందుతుందని ఆశీస్తున్నట్లు ఆయన చెప్పారు.

త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు శంకుస్ధాపన చేస్తాంమని, విశాఖపట్నం ఆంద్రకు తలమానికంగా నిలబడుతుందన్నారు.బాంబు పడుతుందంటే భయం వేస్తుంది కానీ సీమ టపాకాయ వచ్చిందంటే భయం ఎందుకు వేస్తుందని, నిబంధనలను ఉల్లంఘిస్తూ సభలు పెట్టి అడ్డుకుంటున్నారు అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారని విమర్శించారు.

గతంలోనే చెప్పాం లోకేష్ పాదయాత్రకు చేస్తే తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, పవన్ కు 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాంమని, పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే జనం వెళ్ళటం లేదా అని, అలాగే లోకేష్ వస్తున్నాడంటే టిడిపి నాయకులు, కార్యకర్తలు వెళ్తారన్నారు.నారా లోకేష్ పాదయాత్ర వచ్చే జనాల కంటే 2019లో పవన్ కు ఇంతకంటే ఎక్కువ జనం చూసాంమని, గత ఎన్నికల్లో పవన్ ఒక్క సీటు గెలువలేక పోయాడని, ప్రజాభిమానం ఉందని గడప గడప‌ కార్యక్రమంతో తెలుస్తుందన్నారు.

ప్రజా అభిమానం ఉందో‌ లేదో‌ తెలుసుకునేందుకు బాదుడే బాదుడు,ఇదేం కార్మ మనకు కార్యక్రమంతో ఇంటింటికి వెళ్తే ప్రజల అభిమానం ఏంటో తెలుస్తుందన్నారు.సోషల్ మీడియాతో ప్రజలు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారని, చంద్రబాబును, లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో‌ లేరని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube