ఏపీ రాజధాని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారించనుంది.కాగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది.
మరోవైపు అమరావతి, మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైయ్యాయి.ఈనెల 23న అమరావతి, మూడు రాజధానుల కేసుపై ధర్మాసనం విచారణ చేయనుంది.







