తెలంగాణలో మిషన్ 90 లక్ష్యంగా బీజేపీ అడుగులు

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ ఇప్పటి నుంచే తనదైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.ఇందులో భాగంగా మిషన్ 90 లక్ష్యంగా బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 Bjp Steps Up Mission 90 Target In Telangana-TeluguStop.com

పదిహేను రోజుల్లో పదకొండు వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది.ఈ మేరకు గ్రామాల్లో ఈనెల 10 వ తేదీ నుంచి 25 వరకు కార్నర్ మీటింగ్స్ ను నిర్వహించనుంది.

ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి పార్టీ ఎనిమిది వందల మంది లీడర్లను నియమించింది.ఈ క్రమంలోనే ఇవాళ మన్నెగూడలో బీజేపీ నేతలను శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.

కార్నర్ మీటింగ్స్ లో ఏ అంశాలు చర్చించాలనే దానిపై నేతలను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube