ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.పోలీసులు ఇప్పటికే ఆమె మృతి గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారనే సంగతి తెలిసిందే.
చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో వాణీ జయరాం అంత్యక్రియలు జరిగాయి.ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం ఉండటంతో ఆమె మృతి విషయంలో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఈ కేసు విషయంలో పోలీసులు ముందడుగులు వేయనున్నారని సమాచారం.కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణాన్ని మరవక ముందే వాణీ జయరాం మృతి చెందడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది.వాణీ జయరాం 14 భాషలలో 20,000కు పైగా పాటలు పాడిన అరుదైన ఘనత వాణీ జయరాం సొంతం కావడం గమనార్హం.

1945 సంవత్సరం నవంబర్ నెల 30వ తేదీన వాణీ జయరాం జన్మించారు.పది సంవత్సరాల వయస్సులోనే ఆలిండియా రేడియో పాటలు పాడటం ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు.ఈమె అసలు పేరు కలైవాణి.
1969 సంవత్సరంలో ఆమెకు పెళ్లి అయినా పిల్లలు కలగలేదు.ఐదు సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయారు.పిల్లలు చనిపోవడంతో ఆమె అప్పటినుంచి ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నారు.ఒంటరి జీవితాన్ని గడపటానికే ఆమె ప్రాధాన్యత ఇచ్చారని బంధువులతో కలిసి ఉండటానికి ఆమె ఇష్టపడలేదని తెలుస్తోంది.

వాణీ జయరాం వివాదాలకు దూరంగా ఉండగా ఉండటంతో పాటు ఇతరులకు తన వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉండేవారు.ఆమెకు శత్రువులు ఉండే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.తెలుగులో కూడా వాణీ జయరాం పదుల సంఖ్యలో పాటలు పాడారు.ఆమె గాత్రానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఆమ మరణ వార్త విని వాణీ జయరాం శోకసంద్రంలో మునిగిపోయారు.వాణీ జయరాంకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.







