యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా పొలిటికల్ వర్గాల్లో అతని గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.తారక్ ఏదో ఒకరోజు సీఎం అవుతారని తాతకు తగ్గ మనవడిగా ప్రూవ్ చేసుకుంటారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి లక్ష్మీపార్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
సీఎం జగన్ లా ఐదేళ్ల పాటు ప్రజల్లో ఉంటే మాత్రమే ఐదు సంవత్సరాల తర్వాత తారక్ కు అవకాశం ఉండవచ్చని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.తారక్ ఐదేళ్ల పాటు పూర్తిస్థాయిలో రాజకీయ శిక్షణ పొందాల్సిన అవసరం అయితే ఉందని లక్ష్మీ పార్వతి తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని బ్రతికించే సత్తా ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని నందమూరి కుటుంబాన్ని అవసరానికి అనుగుణంగా వాడుకుంటోందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.గతంలో బాలయ్య కూడా టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పార్టీకి ప్లస్ కావక్ఛని మైనస్ కూడా కావచ్చని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి నోరు మెదపడానికి ఇష్టపడటం లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.వచ్చే నెల నుంచి తారక్ సినిమాల రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.తారక్ కొత్త సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.భిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా తారక్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.భిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా తారక్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
ఎన్టీఆర్ కు క్రేజ్ ఎంతగానో పెరుగుతున్న సంగతి తెలిసిందే.