నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమితులైయ్యారు.ఈ మేరకు ఆదాల పేరును వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఖరారు చేశారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపు నుంచి ఆదాల పోటీకి దిగనున్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎంపీ ఆదాల మాట్లాడుతూ తనకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు.
జగన్ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తానని స్పష్టం చేశారు.భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం పార్టీ ఇంఛార్జ్ గా ఆదాలను ఫైనల్ చేసింది.