తెలంగాణ ప్రభుత్వం పాలన పరంగా దూకుడు పెంచింది.అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయని సమాచారం.ఒకేసారి 15 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
మొన్న ఐపీఎస్ ల బదిలీలు చేసిన ప్రభుత్వం ఇవాళ ఐఏఎస్ ల బదిలీలకు రంగం సిద్ధం చేసింది.అదేవిధంగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే సమర్థులు, అనుకూలంగా ఉండే వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాలు ముగియగానే భారీ ఎత్తున సీనియర్ ఐఏఎస్ లకు స్థానచలనం జరిగే అవకాశం ఉంది.