బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారన్నారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన భవనాలను ఇప్పుడు మంత్రి ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు.తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్, జిల్లా మంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదని విమర్శించారు.







