సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఆ తర్వాత నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.ఈ సక్సెస్ ఫుల్ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ కాంబో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఇంకా అధికారికంగా స్టార్ట్ కాకుండానే ఎప్పుడు ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది.తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.మార్చిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని ఈ రోజు నెట్టింట ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.
అయితే ప్రెజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.ఈ క్రమంలోనే మార్చి నుండి మహేష్ రాజమౌళి సినిమాకు డేట్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.ఇక రాజమౌళి ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి ఇంకా నటీనటుల ఎంపిక చేయలేదు.అయితే రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా దీపికా పదుకొనె అయితే బాగుంటుంది అని మేకర్స్ ఫీల్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.