అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం చోటు చేసుకుంది.జీఎఫ్ఎంఎస్ కంపెనీలో రియాక్టర్ పేలినట్లు తెలుస్తోంది.
పేలుడు సమయంలో భారీ శబ్ధం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.దీంతో బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.