బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.గత పది సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభమై ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది.
ఈ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ కార్యక్రమానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా నాగబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చారు.

ఇలా సింగర్ మనో కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.అయితే కొంతకాలానికి ఈయన కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం జరిగింది.ఈ విధంగా సింగర్ మను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈయన వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.
మల్లెమాల వారితో మనస్పర్ధలు రావడం వల్లే ఈ కార్యక్రమం నుంచి మనో తప్పకున్నారనే వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ విషయంపై సింగర్ మనో స్పందించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు మల్లెమాల వారితో ఎలాంటి గొడవలు లేవని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు.కోవిడ్ కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డాయని , ఇందులో ఇళయరాజా, ఎఆర్ రెహమాన్లతో తాను చేయాల్సిన షోలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తను జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సరిగమప కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా మనో జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడటానికి గల కారణాలను తెలియజేశారు.







