నటి జమున. ప్రస్తుతం ఆమె కాలం చేసింది అనే విషయం మనందరికీ తెలుసు.
ఆమె గురించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.అయితే ఒక కొత్త విషయం మీతో పంచుకోవాలని ఈ ఆర్టికల్ మొదలుపెట్టాను.
ఇప్పటి తరం వారికి నటించడం తెలియదు, ఎలా టెక్నీషియన్స్ పనిచేస్తున్నారో తెలియదు, కెమెరా ఎక్కడ పెడితే తాము ఎలా కనబడతాము అనే విషయాలపై ఎలాంటి అవగాహన ఉండదు.కానీ నాటి ప్రతి విషయంపై స్పష్టమైన అవగాహన ఉండేది.
కెమెరా ఎక్కడ పెడితే తమను తాము ఎలివేట్ చేసుకోవచ్చు, లైట్ తమపై సరిగా పడుతుందా లేదా ? మేకప్ ఎలా చేసుకున్నామో అనే విషయాలపై తగిన జాగ్రత్త తీసుకునేవారు.ఇలాంటి విషయాలకు జమున కూడా మినహాయింపు కాదు.
ఒక మీడియా మిత్రురాలు ఇంటర్వ్యూ చేయడానికి కలిసినప్పటికీ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఆ విషయాలే ఈరోజు మీ ముందుకు తెస్తున్నాను.
ముగ్గురు కేంద్రాల మండలం సెటప్తో ఇంటర్వ్యూ చేయడానికి సర్వం సిద్ధమైన తర్వాత, కెమెరాలను ఒక్కసారిగా గమనించి ఆమె ఒక విషయాన్ని చెప్పారు.
ఈ కెమెరా ఇక్కడ పెడితే నా ముక్కు పై నీడ పడుతుంది అని చెప్పారు.ఆవిడ పరిశీలించిన విధానాన్ని చూసి అక్కడ ఉన్న కెమెరామెన్ లకు మొదట ఆశ్చర్యము ఆ తర్వాత విసుగు వచ్చాయి.ఈవిడ ఇలా కూడా గమనించడం ఆవిడతో పాటు అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అందుకే కదా ఆమె అంత గొప్ప నటి కాగలిగింది.అందుకే కొంతమంది ఈ జమునకు అహంకారం ఎక్కువ అని అంటూ ఉంటారు.
ఇండస్ట్రీ ఎవరికీ కలర్ సినిమా కానే కాదు.అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ తనను తాను మలుచుకోవడం అనేది పూర్తిగా ఆ నటి చేతిలోనే ఆధారపడి ఉంటుంది.అందుకే ఎన్టీఆర్ అక్కినేని వంటి మహా మహానటులనే ధిక్కరించి ఆమె నిలబడగలిగింది అంటే అందుకు ఆమె పట్టుదల, కష్టం మాత్రమే కాకుండా ప్రతి విషయాన్ని పరిశీలించడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.ఆమె చనిపోయిన తర్వాత చాలామంది చాలా వార్తలు రాస్తున్న ఇది కూడా అభిమానులకు తెలియాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు తెచ్చాము.