టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్.ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహించారు.
భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.ఇందులో శ్రీకాంత్, భరత్ కీలక పాత్రలు పోషించారు.
కాగా ఈ సినిమా ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా సుధీర్బాబు మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
రొమాంటిక్ సినిమాల గురించి స్పందిస్తూ బోల్డ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.
ప్రేక్షకులు ప్రస్తుతం ఫ్యూర్ రొమాంటిక్ సినిమాలను చూడటం లేదని, ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, గూస్ బంమ్స్ మూవ్మెంట్స్ ఉండే సినిమాలను మాత్రమే ప్రేక్షకులకు ఆదరిస్తున్నారని, ప్లెయిన్గా, కూల్గా సాగే సినిమాలను ఎంకరేజ్ చేయడం లేదని సుధీర్ బాబు తెలిపారు.అలాగే తన గత చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆడకపోవడానికి కూడా కారణం అదే అని తెలిపారు.ప్రస్తుతం ఇప్పుడు విడుదల అయ్యే సినిమాలలో హీరోయిన్, గ్లామర్ ఎలిమెంట్లు లేకుపోయినా ఫర్వాలేదని, కానీ రెండు మూడు థ్రిల్లింగ్ హై మూవ్మెంట్స్ ని ఆడియెన్స్ కోరుకుంటున్నారని తెలిపారు.
అలాగే కాంతార సినిమా హిట్ అవ్వదానికి అదే కారణమన్నారు.ఎంగేజింగ్గా స్క్రీన్ప్లే ఉంటే, అదిరిపోయేలా యాక్షన్, కట్టిపడేసే ఎమోషన్స్ ఉంటే గ్లామర్ని ఆడియెన్స్ కోరుకోవడం లేదన్నారు సుధీర్బాబు.తన హంట్ సినిమాలో అలాంటి థ్రిల్లింగ్, హై మూవ్మెంట్స్ ఉంటాయన్నారు.
అనంతరం బావ మహేష్తో కలిసి నటించడంపై స్పందిస్తూ.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ అంతర్జాతీయ అడ్వెంచర్ ఫిల్మ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
అలాంటి చిత్రంలో అవకాశం వస్తే నటిస్తానని తెలిపారు సుధీర్బాబు.