హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎదుట ఉపాధ్యాయ దంపతులు మౌన దీక్ష

హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ఉపాధ్యాయ దంపతులు మౌన దీక్ష చేపట్టారు.13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీల కోసం దీక్షకు దిగారు.పిల్లలతో కలిసి ప్లకార్డులు, జెండాలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు.నరకం అనుభవిస్తున్నామని ఉపాధ్యాయ దంపతులు వాపోతున్నారు.615 మందికే అవకాశం ఇచ్చారని, మిగతా వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అందరికీ అవకాశం ఉన్నా బదిలీలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 The Teacher Couple Observed Silence In Front Of The Director Of School Education-TeluguStop.com

ఇప్పటికైనా ఈ అంశంపై సీఎం కేసీఆర్ కల్పించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.అయితే రోడ్డుపై వందలాది ఉపాధ్యాయ దంపతులు నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube