రాంగోపాల్ పేట ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.ఈ ప్రమాదంలో చిక్కుకున్న కొంతమందిని ఫైర్ ఫైటర్స్ రక్షించారని ఆయన చెప్పారు.

 Minister Talasani Inspected The Ramgopal Peta Accident Site-TeluguStop.com

ఇంకా భవనంలో ఇద్దరు చిక్కుకున్నారని అనుమానం ఉందన్నమంత్రి తలసాని ఫోన్లు చేసినా రెస్పాండ్ కావడం లేదని తెలిపారు.ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.పక్క భవనాలకు ఎలాంటి ప్రమాదం లేదని, మరో రెండు, మూడు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని స్పష్టం చేశారు.

అయితే ఉదయం 11 గంటల సమయంలో భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సెల్లార్ వన్ లో మొదలైన మంటలు పైకి వ్యాపిస్తున్నాయి.

ఓ వైపు మంటలు తగ్గుతున్నా దట్టమైన పొగ కమ్ముకుంది.దీంతో సహాయక చర్యలకు కొంచెం ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే భవనంలో చిక్కుకున్న ఐదుగురిని ఫైర్ ఫైటర్స్ క్రేన్ సాయంతో రక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube