నెల్లూ రు జిల్లా వెంకటగిరి వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య వివాదాలు బహిర్గతమైయ్యాయి.
బాలాయపల్లి మండలం మన్నూరులో ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.ఆటల పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
కాగా గత కొంతకాలంగా ఎమ్యెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.అటు ప్రభుత్వ తీరుపై సైతం ఎమ్మెల్యే ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







