ప్రతిపక్షాలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.తమ పార్టీ డీఎన్ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు.అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.
ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏనాడూ సంక్షేమ పథకాలు ఆగలేదని సజ్జల తెలిపారు.సీఎం జగన్ బలహీన వర్గాలకు విద్య, వైద్యాన్ని చేరువ చేశారని కొనియాడారు.
అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.జగన్ ను అధికారంలో కొనసాగించడం బలహీన వర్గాలకు అవసరమన్న సజ్జల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని వెల్లడించారు.







