మళ్లీ మాస్కులు తప్పనిసరి చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

మహమ్మారి కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.చైనా దేశంలో పరిస్థితి మరీ చాలా అధ్వానంగా మారింది.

 Kerala State Government Made Masks Mandatory Again Details , Kerala State Govern-TeluguStop.com

రోజుకి కొన్ని కోట్లల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.అక్కడి ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో… చైనాలో కరోనా విలయతాండవం చేస్తుంది.

దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.ఇప్పటికే కరోనా కట్టడికి సంబంధించి ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేయడం కూడా జరిగింది.చైనాలో కొత్త కేసులకి ప్రధాన కారణం BF7 అనే కొత్త కరోనా వేరియంట్.

ఈ వేరియంట్ అత్యంత వేగవంతంగా వ్యాప్తి చెందుతూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశంలో BF7 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేయడం జరిగింది.బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది.అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలని తెలిపింది.ప్రజలు కోవిడ్ నుండి సురక్షితంగా ఉండాలంటే ఈ నిబంధనలు పాటించాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube