విశాఖ జిల్లాలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ప్రమాదం జరిగింది.పీఎస్ ఆవరణలోని ఖాళీ స్థలంలో పార్క్ చేసిన వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పుబెట్టారు.
దీంతో పార్కింగ్ లో ఉన్న వాహనాలన్నీ పూర్తిగా దగ్ధం అయ్యాయి.వీటిలో సుమారు 30 బైకులు, నాలుగు కార్లు ఉన్నాయి.
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.