కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వచ్చిన బెదిరింపు కాల్స్ పై మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఓ గ్యాంగ్ స్టర్ కాల్స్ చేసినట్లు గుర్తించారు.
బెళగావిలోని జైలులో ఉంటున్న గ్యాంగ్ స్టర్ జయేశ్ కాంతా అక్కడి ల్యాండ్ లైన్ ఫోనును దుర్వినియోగం చేసి బెదిరించినట్లు పోలీసులు నిర్ధారించారు.తనకు పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని, లేకుంటే గడ్కరీని చంపేస్తానంటూ గడ్కరీ కార్యాలయానికి కాల్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో డబ్బు పంపాల్సిన చిరునామాతో పాటు మొబైల్ నంబరును కూడా చెప్పాడని పోలీసులు తెలిపారు.కాగా జయేశ్ కాంతా ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు.
గడ్కరీ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.