సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు సర్కార్ అనుమతులు మంజూరు చేసింది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు రేట్లు పెరగనున్నాయి.ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 , వీరసింహారెడ్డి సినిమాకు రూ.20 పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.ఈ క్రమంలో పెరిగిన ధరలు పది రోజులపాటు అమలులో ఉండనున్నాయి.







